రైతన్నలకు అలర్ట్: AP PMFBY Crop Insurance 2026 అప్లికేషన్ చివరి తేదీ పొడిగింపు!
AP PMFBY Crop Insurance 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాగుదారులు మరియు కౌలు రైతుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం జరిగింది, రాబోయే రోజుల్లో అకాల కరువు ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ (PMFBY) మరియు వాతావరణ ఆధారిత పంట బీమా దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
అంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, గతంలో ముగిసిన ఈ రిజిస్ట్రేషన్ల గడువును ఇప్పుడు ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించారు.
మందకొడిగా సాగుతున్న రిజిస్ట్రేషన్లు.. ప్రభుత్వం ఆందోళన
అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది పంటల బీమా నమోదు ప్రక్రియ అనుకున్న స్థాయిలో వేగవంతంగా సాగడం లేదు. క్షేత్రస్థాయి గణాంకాల ప్రకారం ఇప్పటివరకు కేవలం 15.25 లక్షల ఎకరాలకు వరకు మాత్రమే రైతులు బీమా ప్రీమియం చెల్లించారు.
ప్రత్యేకించి ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప, వేరుశనగ, కంది, మినుము, మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులు పలు జిల్లాల్లో ఇంకా వారి ఎకరాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయలేదు. కొన్ని మండలాల్లో అయితే నమోదు విస్తీర్ణం సున్నాగా ఉండటం పై అధికారులు తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్ర వ్యవసాయ శాఖ, ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఈ గడువును పెంచడం జరిగింది.
నామమాత్రపు బీమా రుసుము – ప్రభుత్వం నుండి భారీ సబ్సిడీ
రైతులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ బీమా ప్రీమియంలో సింహభాగం మొత్తాన్ని ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో భరిస్తోంది.
సాధారణ వరి పంట సాగు చేసే రైతులు: ఎకరాకు కేవలం ₹160/- చెల్లిస్తే సరిపోతుంది.
జిల్లా ప్రాతిపదికన వ్యత్యాసాలు:
కోనసీమ జిల్లా: వరి పంటకు ఎకరాకు కేవలం ₹76/- మాత్రమే.
వైఎస్సార్ కడప జిల్లా: కంది పంటకు ఎకరాకు కేవలం ₹36/- మాత్రమే.
అతి తక్కువ వ్యయంతో మీ పంటకు పూర్తి స్థాయి ఆర్థిక భద్రత లభిస్తుంది అని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది . ఏదైనా ప్రకృతి వైపరీత్యం వల్ల పంట నష్టం జరిగితే, అప్పుడు నష్ట పరిహారపు సొమ్ము ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
గడువు తేదీలు & అప్లికేషన్ వేదికలు
| అంశం | సమాచారం / వివరాలు |
| పథకం పేరు | ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) & RWBCIS |
| పంటలు | వరి, పత్తి, మిరప, కంది, మినుము, వేరుశనగ, మొక్కజొన్న మొదలైనవి |
| చివరి తేదీ (Deadline) | ఆగస్టు 15 |
| దరఖాస్తు మార్గాలు | మీసేవ, సీఎస్సీ (CSC) సెంటర్లు, రైతు సేవా కేంద్రాలు (RBK) లేదా ఆన్లైన్ |

ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చే పంటలు & అర్హత గల జిల్లాలు
ఈ బీమా స్కీమ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించే అనేక రకాల ఆహార, వాణిజ్య పంటలకు అంధ్రప్రదేశ్భ రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తున్నారు. రైతులు తమ పంటను రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ఆర్థిక నష్టాల నుంచి పూర్తి రక్షణ పొందవచ్చు.
పంటలు – వర్తించే జిల్లాల వివరాలు (Table Format):
| క్రమ సంఖ్య | పంట రకం | అర్హత కలిగిన జిల్లాలు / పంటల వివరాలు |
| 1 | వరి (Paddy) | రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలలో వర్తిస్తుంది. |
| 2 | మిరప (Chilli) | ప్రత్యేకంగా ఎంపిక చేసిన 8 జిల్లాలలో లభిస్తుంది. |
| 3 | కంది (Red Gram) | నిర్ణయించిన 10 జిల్లాలలోని రైతులకు వర్తిస్తుంది. |
| 4 | చిరుధాన్యాలు (Millets) | రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు మరియు మొక్కజొన్న. |
| 5 | పప్పుధాన్యాలు (Pulses) | మినుములు, పెసర్లు. |
| 6 | నూనె గింజలు (Oil Seeds) | ఆముదం, వేరుశనగ (1 జిల్లాకు వర్తిస్తుంది). |
| 7 | ఇతర వాణిజ్య పంటలు | నువ్వులు, ఉల్లిపాయలు, పసుపు. |
కావలసిన పత్రాల జాబితా (Required Documents Checklist)
రిజిస్ట్రేషన్ కోసం వెళ్లేముందు రైతులు క్రింది డాక్యుమెంట్లను సిద్ధం చేసి ఉంచుకోవాలి:
- రైతు ఆధార్ కార్డు (గుర్తింపు నిరూపణ)
- 1B / పట్టాదార్ పాస్ పుస్తకం (భూమి యజమాన్య హక్కులు)
- ఈ-పంట నమోదు రసీదు / ఏరియా సోన్ సర్టిఫికేట్ (సాగు చేసిన వైశాల్య ధృవీకరణ)
- బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్ (పరిహారం జమా కొరకు)
- చరవాణి సంఖ్య (Mobile Number)
స్మార్ట్ఫోన్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసే పూర్తి విధానం
రైతులు ఎవరిపైనా ఆధారపడకుండా తమ మొబైల్ నుంచే సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు:
- ముందుగా అధికారిక పోర్టల్ pmfby.gov.in ని ఓపెన్ చేయండి.
- హోమ్పేజీలో కనిపించే ‘Farmer Corner’ బటన్పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, వచ్చిన OTP ద్వారా లాగిన్ పూర్తి చేయండి.
- మీ వ్యక్తిగత సమాచారం, ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా వివరాలను నింపండి.
- మీ భూమి సర్వే నంబర్, జిల్లా, మండలం, పంట పేరు మరియు విస్తీర్ణం వివరాలను నమోదు చేయండి.
- చివరగా మీ పంటకు నిర్ణయించిన రుసుమును Net Banking, UPI (GPay/PhonePe) లేదా Debit Card ద్వారా చెల్లించి, రసీదును (Receipt) సేవ్ చేసుకోండి.

రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం:
వాతావరణంలో మార్పుల వల్ల ఈసారి వర్షాలు సకాలంలో పడకపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. కరువు వంటి పరిస్థితులు ఎదురైతే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే చివరి తేదీ ఆగస్టు 15 దాకా ఆగిపోకుండా, వీలైనంత త్వరగా మీ గ్రామంలోని ఆర్బీకే (RBK) లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి బీమా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోండి!
ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ అప్డేట్స్ మరియు లేటెస్ట్ వార్తల కోసం మన పేజీని వెంటనే ఫాలో అవ్వండి!
ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ తోటి రైతన్నలు, శ్రేయోభిలాషులకు షేర్ చేయడం మర్చిపోకండి.